గిన్నిస్ బుక్‌లో చేరనున్న ప్రభాస్.. కానీ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

 Prabhas 21 May Enter Guinness Book, Prabhas, Prabhas 21, Nag Ashwin, Radhe Shyam-TeluguStop.com

కాగా ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని ఓకే చేశాడు ప్రభాస్.

మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ భారీ సినిమాలో నటించేందుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.ఈ సినిమాను సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాను ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు నిర్మాత సి.అశ్వినిదత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే టాలీవుడ్‌లో అత్యధిక బడ్జెట్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఒకవేళ ప్రభాస్ సినిమాకు నిజంగానే అంతమేర బడ్జెట్ కేటాయిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా గిన్నిస్ రికార్డులోకెక్కడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు రూ.500 కోట్ల బడ్జెట్ సినిమా రాలేదు.మరి ప్రభాస్‌కు ఉన్న ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవాలంటే ఈ మాత్రం బడ్జెట్ పెట్టాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.ఇక ఈ సినిమాను యూనివర్సల్ సినిమాగా రిలీజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube