యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ షూటింగ్ ఇటీవల జార్జియాలో జరుపుకున్న విషయం తెలిసిందే.
సాహో
చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ను నిలిపివేశారు.
పీరియాడికల్ మూవీ
గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో
ప్రభాస్ వింటేజ్
లుక్తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్.అయితే కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడ్డ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
శరవేగంగా ఈ సినిమా
పోస్ట్ ప్రొడక్షన్
పనులు జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన
ఫస్ట్ లుక్
ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో
పూజా హెగ్డే
హీరోయిన్గా నటిస్తోంది.
జిల్ ఫేం రాధాకృష్ణ
డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా
1960
నాటి బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోంది.