యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇటీవల జార్జియాలో షూటింగ్ మధ్యలో ఆపేసి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఎలాంటి షూటింగ్లు జరగడం లేదు.
అయితే సాహో తరువాత కాస్త గ్యాప్ తీసుకుని ప్రభాస్ ఈ సినిమాను స్టార్ట్ చేశాడు.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దీంతో ఈ సినిమాను ఎలాగైనా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
ఇంకా జార్జియాలో జరగాల్సిన షూటింగ్ మిగిలే ఉంది.ఆ తరువాత మరికొన్ని షెడ్యూల్ల షూటింగ్ కూడా ఉంది.
ఇవన్నీ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది.ఇక పోస్ట ప్రొడక్షన్ పనులు జరగాలంటే కూడా చాలా సమయం పడుతుంది.
అయితే ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యేలా లేదు.దీంతో ఈ సినిమా సంక్రాంతి 2021లో రిలీజ్ కావడం కష్టంగానే ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోండగా యూవీ కరియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.