సౌత్ ఇండియాలో తెలుగు సినిమా పరిశ్రమలతో పాటు ఇతర భాషల సినిమా పరిశ్రమలు ఉన్నా కూడా టాలీవుడ్ స్టార్స్కే జాతీయ స్థాయిలో అధిక గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.మన టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా ఫాలోవర్స్ను పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది.
ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో విజయ్ దేవరకొండ 8 మిలియన్ల ఫాలోవర్స్ను దక్కించుకున్నాడు.సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ను దక్కించుకోలేదు.దాంతో సౌత్ ఇండియన్ ఇన్స్టాగ్రామ్ నెం.1 స్టార్గా రౌడీ స్టార్ నిలిచాడు.
ఫేస్ బుక్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన రికార్డును సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే టాప్గా నిలిచాడు.ఫేస్బుక్లో ప్రభాస్ అధికారిక ఖాతా ఏకంగా 16 మిలియన్ల ఫాలోవర్స్ను దక్కించుకున్నాడు.
బాలీవుడ్ హీరోల్లో కొద్ది మంది మాత్రమే 15 మిలియన్ల ఫాలోవర్స్ అంతకు మించి ఉన్నారు.కోలీవుడ్లో హేమా హేమీలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం వారి ప్రభావం అంతగా కనిపించడం లేదు.
మన తెలుగు హీరోలు సోషల్ మీడియాను దున్నేస్తూ ఉన్నారు.
కేవలం వీరిద్దరు హీరోలు మాత్రమే కాకుండా అల్లు అర్జున్, మహేష్బాబులు కూడా సౌత్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్స్గా ఉన్నారు.ప్రభాస్కు వచ్చిన జాతీయ స్థాయి స్టార్ డం కారణంగా ఫేస్ బుక్లో 16 మిలియన్ ఫాలోవర్స్తో ఎవరికి అందనంత ఎత్తులో ప్రభాస్ నిలిచాడు.ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్ మరియు నాగ్ అశ్విన్ మూవీలు విడుదల అయితే బాలీవుడ్ స్టార్స్ను కూడా క్రాస్ చేసేంతగా ఫేస్ బుక్ లైక్స్ను ప్రభాస్ దక్కించుకునే అవకాశం ఉంది.