యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు రూపొందిస్తున్న సినిమా రాధే శ్యామ్.ఈ సినిమా షూటింగ్ సెకండ్ వేవ్ కారణంగా తుది దశ ఆగిపోయింది.
సెకండ్ వేవ్ తర్వాత వారం పది రోజుల్లోనే పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేస్తాం అంటూ యూవీ క్రియేషన్స్ వారు చెప్పారు.షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది.
కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.ఇటీవలే కృష్ణం రాజు తన పాత్ర ను పూర్తి చేశారు.
త్వరలోనే ప్రభాస్ కూడా పూర్తి చేస్తాడని అన్నారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ఎప్పటికి ముగుస్తుందో తెలియడం లేదట.
షూటింగ్ ను మరో వారం పది రోజులు నిర్వహిస్తారని కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం రాధే శ్యామ్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ కొట్టి పారేస్తున్నారు.
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే జులై లో అంటే నెల విడుదల చేయాల్సి ఉంది.కాని కరోనా సెకండ్ వేవ్ వల్ల నిలిచి పోయింది.అయినా కూడా ఈ ఏడాది లోనే సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు.
కాని పరిస్థితి చూస్తుంటే సినిమా రీ టేక్ లు లేదా రీ షూట్ లు ఎక్కువ అవుతున్నాయని.తద్వార సినిమా ఆలస్యం అవుతుందని మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా షూటింగ్ అప్ డేట్ ను యూవీ క్రియేషన్స్ వారు ఇవ్వక పోవడంతో అసలు ఏం జరుగుతుంది అంటూ అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.ముందు ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇవ్వాలంటూ అభిమానులు యూవీ వారిని కోరుతున్నారు.
మరి అందుకు యూవీ వారు సిద్దంగా ఉన్నారా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.