బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం అధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడం కోసం ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రెటీలను అతిథులుగా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.
ఈ క్రమంలోనే రాజమౌళి కొరటాల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎంతో సందడి చేస్తూ 25 లక్షలను గెలుచుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి మరో ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే వచ్చేవారం ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా మరొక స్టార్ హీరో కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నట్లు సమాచారం.ఇప్పటికే కొందరు సెలబ్రెటీలతో ఎంతో సందడిగా సాగిన ఈ కార్యక్రమం తరువాత మహేష్, ప్రభాస్ లను ఆహ్వానించి ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ మహేష్ వస్తే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు.