టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం గురించి అందరికి తెలిసిందే.అటు రాజకీయ పరంగా, ఇటు సినిమా పరంగా సమాన భాద్యతలు వహిస్తున్నాడు.
ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.ఇదిలా ఉంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ కు కరోనా సోకినా సంగతి తెలిసిందే.
ఇక పవన్ పూర్తిగా శాకాహారిగా మారాడని తెలిసింది.
నిజానికి పవన్ కళ్యాణ్ కు ఒకప్పుడు నాన్ వెజ్ బాగా తినే వాడట.
అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా బాగా ఆసక్తి చూపుతున్నాడట.ఎక్కువగా సీ ఫుడ్ బాగా ఇష్టపడే వాడట.
చేపల పులుసు, నాటుకోడి కూర, పులిహోర బాగా ఇష్టపడి తినే వాడట.కానీ ఇప్పుడు అవన్నీ వదులుకున్నాడని తెలిసింది.
అంతేకాకుండా పూర్తిగా శాఖాహారి గా మారాడు.
గత ఏడాది నుండి పూర్తిగా మాంసాహారాన్ని వదిలేశాడని తెలిసింది.కేవలం రోజుకు ఒక్కసారి మాత్రమే తినాలని నిర్ణయం తీసుకున్నాడట.అది కూడా మొత్తం కాయగూరలు, ఆకుకూరలు మాత్రమే తీసుకోవాలని మొత్తానికి శాకాహారిగా మారాడు.
అంతేకాకుండా ఇటీవలే కరోనా సోకినప్పుడు కూడా మొత్తం ఇలాంటి ఫుడ్డు ని తీసుకున్నాడట.ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నందునే త్వరగా కోలుకున్నాడని తెలిసింది.
ఇదిలా ఉంటే పవన్ ఇటీవలే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇక పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియుమ్ రీమేక్ లో నటించిన సంగతి తెలిసిందే.ఇక ఇవే కాకుండా వకీల్ సాబ్ సీక్వెల్ లో ప్లాన్ చేయగా అందులో కూడా పవన్ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇక డైరెక్టర్ రమేష్ వర్మ తో కూడా మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.