టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో లేనంత బిజీగా పవన్ కళ్యాణ్ వరుస అవకాశాలతో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి.
పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుండగా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, పవన్ క్రిష్ కాంబినేషన్ లోని సినిమా ఈ ఏడాదే విడుదల కానున్నాయని సమాచారం.
ఈ సినిమాలతో పాటు పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే పవన్ కళ్యాణ్ ఒక కొత్త దర్శకుని కథ విని ఆ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సినిమాను నిర్మిస్తున్న ఒక సినిమా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.
అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే పవన్ హీరోగా కొత్త దర్శకుని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న పవన్ కొత్త దర్శకునిగా ఛాన్స్ ఇచ్చాడంటే ప్రయోగమేనని ఇండస్ట్రీ వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్త్మవుతున్నాయి.ఈ కాంబినేషన్ తెరపైకి వస్తే పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ తో పాటు అధికారిక ప్రకటన వెలువడని మరికొందరు దర్శకుల సినిమాలు సైతం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పవన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు.ఏపీలో చోటు చేసుకున్న వివిధ అంశాల గురించి స్పందిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.