పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడం వల్ల ఈ చిత్ర నిర్మాణం ఆగిపోయింది.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటికే ఈ సినిమాలో దాదాపు అన్ని పాత్రలు షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు.ఈ షూటింగ్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెట్రో రైలులో ప్రయాణించారు.
మెట్రోలో మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు పవన్ ప్రయాణించాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలో నటించగా పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో శృతిహాసన్ నటించనున్నారు.
వకీల్ సాబ్ చిత్రం హిందీలో సూపర్ హిట్ చిత్రమైన పింక్ చిత్రాన్ని రీమేక్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు.
వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉండటంతో,టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ ను కూడా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టినట్లు చిత్ర బృందం తెలిపింది.పవన్ కళ్యాణ్ పై షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కంటిన్యూగా పవన్ ఈ షెడ్యూల్ లో పాల్గొని తనపై సన్నివేశాలను పూర్తి చేయనున్నాడు.ఒక వైపు సినిమాలు మరోవైపు, జనసేన పార్టీ కార్యక్రమాలను చూసుకుంటూ, తాను అంగీకరించిన అన్ని సినిమాలను పూర్తి చేయనున్నాడు.
ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.