సోషల్ మీడియా వచ్చాక ఎవరికి వారికి సొంత మీడియా చేతిలో ఉన్నట్టే ఉంటోంది.ఎవరు ఏం చేయాలన్నా, ఎవరి మీద ఏ విమర్శలు చేయాలన్నా….సోషల్ మీడియాలో వారి మీద పోస్టింగ్స్ పెట్టేస్తున్నారు.తాజాగా… ఓ న్యూస్ ఛానెల్ లో చంద్రబాబు అనని మాటలను కూడా అన్నట్టు మార్పింగ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఇది బాగా… వైరల్ అవ్వడంతో….దీనిపై టీడీపీ ఘాటుగా స్పందించింది.
ఈ మేరకు ఆ పోస్టింగ్లపై టీడీపీ అధికార ప్రతినిధి వర్లరామయ్య ఈ పోస్టింగ్స్ పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశారు.చంద్రబాబు మాట్లాడని మాటలను మార్ఫింగ్ చేసి ఓ న్యూస్ ఛానెల్ లో ప్రసారం చేసినట్టుగా సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయిలు పోస్ట్ చేశారని ఆయన అన్నారు.చంద్రబాబును, సదరు న్యూస్ ఛానెల్ ప్రతిష్టను దెబ్బతీసేలా మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతున్నారని వర్ల రామయ్య అన్నారు.మరెవరు ఇటువంటి తరహా సంఘటనలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.