మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో చాలా మరణాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈనేపథ్యంలో చనిపోయినవారి హస్తికలు నిమజ్జనం చేయడం హిందూ ధర్మంలో ఆచారం కావటంతో చాలామంది కాశీ, గయా లాంటి చోటికి వెళ్ళి గంగానదిలో కలుపుతూ ఉంటారు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణతో అస్తికల కోసం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడం చాలామందికి ఇబ్బందిగా మారింది.ఇటువంటి పరిస్థితుల్లో సమీపం నదులలోని అస్తికలు కలిపేస్తున్నారు.
దీంతో గంగానదిలో తమవారి అస్తికలు కలపలేదన్న బాధ చాలామందిలో కనిపిస్తుంది.
ఇలాంటి వారి కోసం తపాలాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.కరోనా కారణంగా వారణాసికి వెళ్లలేని వారి కోసం ఒక వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.స్పీడ్ పోస్ట్ లో అస్తికలు కోరుకునే చోట నిమజ్జనం చేసేలా అదికూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లైవ్లో చూసేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
దివ్య దర్శన్ అనే సంస్థతో పోస్టల్ శాఖ ఒప్పందం చేసుకొని నిమజ్జన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు చూసేలా ఈ వినూత్న కార్యక్రమానికి తపాలశాఖ ఆలోచన చేసింది, ప్రస్తుతం తపాల శాఖ నిమజ్జన కార్యక్రమం కోసం నాలుగు పుణ్యక్షేత్రాలను ఎంపిక చేసింది.వారణాసి, ప్రయాగ, గయ, హరిద్వార్ ప్రాంతాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.