ఉత్తరాలు చేరువేసే పోస్టాఫీసు శాఖ అలసత్వం ప్రదర్శించడంతో ఓ నిరుద్యోగి ఆ శాఖకు చుక్కలు చూపించాడు.తనకు రావాల్సిన ఓ రిజిస్టర్ పోస్టును ఆలస్యంగా చేరవేయడంతో అతడు ఓ ఉద్యోగం కోల్పోయాడు.
ఈ ఘటన వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంది.ఈ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.2018 ఏప్రిల్ 6వ తేదీన ఓ వ్యక్తికి ఉద్యోగానికి సంబంధించిన కాల్ లెటర్ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపబడింది.
ఆ రిజిస్టర్ పోస్టు 14వ తేదీన ఆ వ్యక్తికి అందాల్సి ఉండగా, అది కాస్త పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా 23వ తేదీన అందింది.
దీంతో ఆ వ్యక్తి ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష రాయలేకపోయాడు.కాగా ఆ వ్యక్తి జిల్లా వినియోగదారుల ఫోరమ్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు.పోస్టల్ శాఖ వల్ల తనకు భారీ నష్టం జరిగిందని, తనకు ఉద్యోగం పోయిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.దీంతో పోస్టల్ శాఖకు రూ.లక్ష జరిమానా విధించింది.అయితే దీనిపై పోస్టల్ శాఖ స్టేట్ కమిషన్ను ఆశ్రయించింది.
అయితే అక్కడ కూడా పోస్టల్ శాఖ అలసత్వానికి మొట్టికాయలే పడ్డాయి.పోస్టల్ డిపార్ట్మెంట్ అలసత్వం కారణంగో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడని, సదరు వ్యక్తకి 30 రోజుల్లోగా నష్టపరిహారం కింద లక్ష రూపాయలు అందించాల్సిందిగా స్టేట్ కమిషన్ ఆదేశం జారీ చేసింది.
పోస్టల్ శాఖ అలసత్వం, నిర్లక్ష్యానికి సరైన బుద్ధి చెప్పాడని ఆ వ్యక్తిని స్థానికులు మెచ్చుకుంటున్నారు.