తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అల్లరి నరేష్.తన తొలి సినిమా ‘అల్లరి‘ అనే చిత్రం ద్వారా అల్లరి నరేష్ గా పరిచయమయ్యాడు.తను నటించే సినిమాలన్నీ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.తను నటించే సినిమాలలో పాత్రకు తగ్గట్టుగా తన నటనను చూపిస్తాడు.అంతేకాకుండా వరుస సినిమాలతో అల్లరి నరేష్ దూసుకుపోతున్నాడు.
తను నటించే సినిమాల లో ఎక్కువగా హాస్య పాత్రలు ఎంచుకోగా ఇటీవలే కొన్ని సినిమాలలో వేరే స్థాయి తరహా సినిమాలను ఎంచుకుంటున్నాడు.
హాస్య పరంగానే కాకుండా, వేరే తరహా పాత్రల్లో కూడా అల్లరి నరేష్ కు గుర్తింపు వచ్చింది.ఇటీవలే హాస్య పరంగ బంగారు బుల్లోడు సినిమా విడుదల కాగా ఈ సినిమా ఊహించినంత విజయాన్ని అందించలేదు.
అంతేకాకుండా అల్లరి నరేష్ ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తి చూపలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కేవలం ఆయన దృష్టిలో మరో సినిమా ఉండగా అది ‘నాంది’ అని తేలింది.
కొత్త దర్శకుడు విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఖైదీ పాత్రలో నటించనున్నాడు.అతడు జైలులో ఉండగా అందులో నుంచి బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ఈ సినిమా తెరకెక్కనుంది.కాగా ఈ సినిమా గత ఏడాది ఓటీటీ ద్వారా విడుదల చేయడానికి సిద్ధంగా ఉండగా.కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేకపోయింది.కానీ తాజాగా ఈ సినిమాను విడుదల చేయడానికి సినీ నిర్మాతలు సిద్ధంగా ఉండగా.ఈ సినిమా హక్కులను రూ.8.5 కోట్లకు కొనుగోలు చేశారని తెలిపారు.ఇక ఈ సినిమా గురించి ఎటువంటి ప్రకటనలు రాకపోగా.త్వరలోనే ఈ సినిమా విడుదల గురించి ప్రకటనలు చేస్తామంటూ సినీ బృందం తెలిపారు.ఇక ఈ సినిమా అల్లరి నరేష్ కు ఎటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.