అమెరికాలో రాజకీయాలు రోజు రోజుకి పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతున్నాయి.నవంబర్ లో ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఇరు పార్టీల నేతలు ఎత్తులపై ఎత్తులతో రాజకీయాలని మరింత రసవత్తరంగా మార్చేస్తున్నారు.
ముఖ్యంగా ట్రంప్ గద్దె దిగడమే టార్గెట్ గా పెట్టుకున్న డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ ని ఏకాకిని చేస్తూ విమర్శలతో ,వ్యూహ ప్రతి వ్యూహాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.అయితే ట్రంప్ కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు డెమోక్రటిక్ నేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ సింగల్ హ్యాడ్ తో నెట్టుకొచ్చేస్తున్నాడు.
ఇదిలాఉంటే
ఎన్నికల హడావిడిలో ఎవరికీ వారు బిజీ బిజీ గా ఉంటున్న తరుణంలో విషం పూసిన ఓ లేఖ వైట్ హౌస్ అడ్రస్స్ గా చేరుకోవడం సంచలనం సృష్టించింది. ఈ న్యూయార్క్ టైమ్స్ కధనం ప్రకారం.
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన , విరుగుడు లేని విషం పూసిన కవర్ వైట్ హౌస్ కి చేరుకుందని, అయితే దీన్ని వైట్ హౌస్ కి రాకముందే ప్రభుత్వానికి చెందిన మెయిల్ సెంటర్ లో అడ్డగించారని, వారికి వచ్చిన అత్యంత గోప్యమైన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా ఈ లేఖ బయటపడిందని తెలుస్తోంది.అయితే
విషం పూసిన కవర్ కెనడా నుంచీ వచ్చిందని అధికారులు గుర్తించారు.ఈ విషయంపై అమెరికా ఎఫ్బీఐ ని ప్రశ్నించగా అమెరికా సీక్రెట్ సర్వీసీస్ అలాగే అమెరికా పోస్టల్ ఇన్స్పెక్షన్ సర్వీస్ కలిసి ఈ లేఖని అనుమానాస్పద లేఖగా గుర్తించి దర్యాప్తు ప్రారంభించాయి.కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకూ వైట్ హౌస్ వర్గాలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
దాంతో ట్రంప్ పై కుట్ర జరిపేందుకే ఈ విషం పూసిన లేఖని పంపారని ట్రంప్ మద్దతు దారులు ఆందోళన చెందుతున్నారు.