సోనుసూద్ గురించి ఇప్పుడు ఎవరినన్నా చెప్పమంటే.అతను ఓ సినిమా నటుడు అని చెప్పడం మర్చిపోయి, అతను ఓ ఆపద్బాంధవుడు అని చెప్తారేమో.
నిజమే.ఎందుకంటే అతను చేసిన సేవలు అటువంటివి మరి.కరోనా వైరస్ సంక్షోభం సమయంలో వలస కార్మికులకు ఆపదలో ఆదుకునే ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు మన సోనుసూద్.సహాయం కోసం ఎదురు చూసే అన్నార్తులకు ఇప్పటికీ తనకున్న దాంట్లో సాయం చేస్తూనే ఉన్నాడు.
అంతటితో ఆగకుండా.పేదలకు సహాయం చేసేందుకు ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసి సాయం చేస్తున్నాడు.ఇకపోతే ఇలాంటి నిస్వార్ధ సేవకుడిని టార్గెట్ చేసుకొని పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.తాజాగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ తో పాటుగా ఆయన సతీమణి అయినటువంటి వైఎస్ భారతి చేసిన మంచి పనుల గురించి ఇతను ఏకరువు పెట్టారు.
ఈ సందర్భంగా… ఏపీ ప్రభుత్వం పాలన పై ప్రశంసలు కురిపించిన పోసాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాల వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నాడు అంటూ ఆకాశానికెత్తేసాడు.
పులివెందులలో స్థలం కొనుగోలు చేసి ఎస్సీ, ఎస్టీ లకు ఇల్లు కట్టించారని.
అంతే కాకుండా YS ఫ్యామిలీ 5 లక్షల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారని… అలాగే శారీరక, మానసిక వికలాంగులకు జగన్ సతీమణి వైఎస్ భారతి తన సొంత డబ్బులతో ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యా, వైద్య సదుపాయం కల్పించారని తెలిపారు పోసాని కృష్ణ మురళి.కానీ ఇవన్నీ వారు చెప్పుకోరని, చెప్పుకొని చేసేది సాయం కాదని అన్నారు.
అంతటితో ఆగకుండా… వాటిని దృష్టిలో పెట్టుకొని, సోనుసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు ఎక్కువగా సేవ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు పోసాని.