టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన పోసాని కృష్ణమురళికి ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న పోసాని సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్నారు.
పోసాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఎం.ఏ చదివిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చానని ఆయన అన్నారు.
ఇండస్ట్రీలో నమస్కారం పెట్టడం కూడా కౌంట్ లోకి వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఒక కో డైరెక్టర్ ప్యాడ్, పేపర్స్ తీసుకొని రమ్మన్నారని అయితే అవి దొరకకపోవడంతో పేరు పెట్టి పిలిచానని ఆయన కామెంట్లు చేశారు.సార్ అనలేవా అని ఆయన తిట్టాడని పోసాని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ఆయనకు సారీ చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.ఆ తర్వాత నన్ను మురళి అని ఎందుకు పిలిచావని మురళిగారు అని ఎందుకు పిలవలేదని కాలితో తన్నానని ఆయన చెప్పుకొచ్చారు.
నా మేనరిజమ్స్ స్ట్రగుల్ తో వచ్చాయని ఆయన తెలిపారు.పరుచూరి బ్రదర్స్ దగ్గర ఐదేళ్లు పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.నేను మెంటలోడినని నేను జైలుకు వెళ్లానని అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రచారం చేశారని ఆయన తెలిపారు.నాకోసం పరుచూరి బ్రదర్స్ పది మందిని తీసేశారని ఆయన చెప్పుకొచ్చారు.
నాకు వ్యక్తిత్వం ఉండటం వల్లే నాకు పరుచూరి బ్రదర్స్ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన తెలిపారు.
నా గురించి జరిగిన నెగిటివ్ ప్రచారాన్ని కూడా నేను చెప్పుకుంటానని ఆయన తెలిపారు.మా నాన్న చాలా మంచోడని పేకాటలో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల చనిపోయారని ఆయన తెలిపారు.నేను ఏ రోజుల్లో కూడా రాంగ్ ట్రాక్ లోకి వెళ్లలేదని ఆయన వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనూ నాకు ఫ్రెండ్ షిప్ లేదని ఆయన వెల్లడించడం గమనార్హం.