తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా దిషా సంఘటన ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది.దిషా నిందితులను వెంటనే ఉరి తీయాలని, కాల్చి చంపాలని రకరకాలుగా డిమాండ్స్ వినిపించాయి.
ఇంకా వారిపై కఠిన చర్యలు తీసుకోవాంటూ డిమాండ్ చేస్తున్నారు.ఆ నలుగురి కుటుంబ సభ్యులు కూడా తమ వారిని చంపడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో ప్రముఖ సినీ నటుడు మరియు రచయిత అయిన పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దిషా నిందితుల కంటే మన దేశంలో ఇంకా క్రూరమైన వారు ఉన్నారు.
మనం ఎన్నుకున్న కొందరు నాయకులు, కొందరు పోలీసులు ఇంకా కొందరు దుర్మార్ఘులు ఈ సమాజంలో ఉన్నారు.వారితో పోల్చితే ఆ నలుగురు క్రూరమైన వారు అని నేను అనుకోవడం లేదు.
ఆ నలుగురిని వెంటనే చంపేయాలంటూ డిమాండ్ చేయడంను తప్పుబట్టారు.అరబ్ దేశాల్లో వెంటనే చంపేసే శిక్షలు ఉన్నాయి.
కాని అక్కడ జనాలు అంతా కూడా మంచి వారు ఉంటారు.మరి మనవద్ద ఉన్న చాలా మంది క్రూరులను వదిలేసి ఆ నలుగురిని చంపేస్తే ప్రయోజనం ఏంటీ అంటూ పోసాని ప్రశ్నించాడు.
సున్నితంగా పోసాని ఈ సమాజంలో ఉన్న చెత్తను ప్రశ్నించాడు.