ఎన్‌కౌంటర్‌పై పోసాని రియాక్షన్‌ ఏంటో తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే

దిషా నిందితులను ఈరోజు తెల్లవారు జామున పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెల్సిందే.సీన్‌ రీ కంస్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయతిస్తుండగా పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి వేశారు.

 Posani Krishna Murali-TeluguStop.com

ఇది తెలంగాణ పోలీసులు చెబుతున్న విషయం.అసలు విషయం ఏంటీ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే.

దాంతో తెలంగాణ పోలీసులు మరియు ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.పోలీసులకు జనాలు జేజేలు పలుకుతున్నారు.

ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో స్పందించే పోసాని కృష్ణమురళి ఈ విషయంలో కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు.ఆయన మాటలు వింటే అంతా కూడా ఆశ్చర్య పోవాల్సిందే.

అందరు అనుకునేదే ఆయన బయటకు అనేశాడు.అంతా కూడా కేసీఆర్‌కు మరియు తెలంగాణ పోలీసులకు సెల్యూట్‌ అంటున్నారు.

వారికి సెల్యూట్‌ సరిపోదు, ఖచ్చితంగా పాదాభివందనం కావాల్సిందే అన్నాడు.వారికి నా పాదాభివందనం అంటూ వ్యాఖ్యలు చేశాడు.

పోసాని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు సమర్ధిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube