దిషా నిందితులను ఈరోజు తెల్లవారు జామున పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెల్సిందే.సీన్ రీ కంస్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు పారిపోయేందుకు ప్రయతిస్తుండగా పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి వేశారు.
ఇది తెలంగాణ పోలీసులు చెబుతున్న విషయం.అసలు విషయం ఏంటీ అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే.
దాంతో తెలంగాణ పోలీసులు మరియు ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తుంది.పోలీసులకు జనాలు జేజేలు పలుకుతున్నారు.
ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో స్పందించే పోసాని కృష్ణమురళి ఈ విషయంలో కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడాడు.ఆయన మాటలు వింటే అంతా కూడా ఆశ్చర్య పోవాల్సిందే.
అందరు అనుకునేదే ఆయన బయటకు అనేశాడు.అంతా కూడా కేసీఆర్కు మరియు తెలంగాణ పోలీసులకు సెల్యూట్ అంటున్నారు.
వారికి సెల్యూట్ సరిపోదు, ఖచ్చితంగా పాదాభివందనం కావాల్సిందే అన్నాడు.వారికి నా పాదాభివందనం అంటూ వ్యాఖ్యలు చేశాడు.
పోసాని వ్యాఖ్యలను ప్రతి ఒక్కరు సమర్ధిస్తున్నారు.