ముక్కుసూటి పోసాని మరోసారి బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేసారు.అది కూడా తను చేస్తున్న ఓ రిలియాలిటి షో మీద, దాన్ని పోలిన రియాలిటి షోల మీద.
పేర్లు ఎందుకు కాని మన తెలుగు టెలివిజన్ లో వస్తున్న “పంచాయితీ” షోల గురించి మీకు తెలిసిందే కదా.భార్యాభర్తల కలహాలు, కుటుంబ గొడవలు, వాటిని సరిచేయడానికి ఒక జడ్జీ.ఈ పంచాయితీ పంచాయితీ లానే సాగితే బాగుంటుంది కాని గొడవల్లో బూతులు, న్యాయనిర్ణేత ఎదో సుప్రీం కోర్టు జడ్జీలా ఫీల్ అయిపోయి వీరి మీద అరవడం, కొట్టేంత పని చేయడం, మధ్యమధ్యలో బూతులు, ఒక్కోసారి డైరెక్ట్ గా కొట్టుకోవడం … అబ్బో .టీవిని చండాలం చేసేస్తున్నారు.ఇలాంటి షోల బండారం బయటపెట్టారు పోసాని.
గొడవలు పెట్టుకోవాలని, బూతులు తిట్టుకోవాలని, కొట్టడానికి వెళ్లాలని ముందే పార్టిసిపెంట్స్ కి చెబుతారట.ఏం చేస్తారు మరి .గొడవలు అయితేనే కదా టీఆర్పీ.ఈ షో కి ఎక్కువగా వచ్చేది పేదవారే.వారికి ఏంతో కొంత డబ్బు ఇస్తారట గొడవలు పడినందుకు.ఒక్కోసారి షూటింగ్ టైంకి రియల్ భార్యాభర్తలు దొరక్కపోతే వీరే ఎవరెవరినో పిలిచి భార్యాభర్తల్లా నటించామంటారట.అలాగని చెప్పి అందరు అలాగే చేస్తారని కాదు, కాని ఎక్కువగా జరిగే తతంగం ఇదేనంట.
పోసాని మాత్రం నిజంగా సమస్యలు ఉన్న భార్యాభర్తలు, కుటుంబాలు వస్తేనే షో చేస్తానని మొండిగా చెప్పారట.
తనకి ఒక్కో ఎపిసోడ్ కి 3.45 లక్షలు వస్తే, తన పారితోషికం నుంచి చాలాసార్లు వారికి సహాయం కూడా చేసారట.మరి పోసాని ఉన్నంత నిజాయితిగా ఇదేరకం షో నిర్వహిస్తున్న మిగితా జడ్జీలు ఉన్నారా? అందులోనూ ఒకనాటి స్టార్ హీరోయిన్స్ న్యాయ నిర్ణేతల అవతారం ఎత్తారు.మరి వారు టీఆర్పి కోసం రియాలిటి షోలలో కూడా నటిస్తున్నారా?
.