వివాహేతర సంబంధం కారణంగా ఓ ప్రముఖ సిరియల్ హీరోయిన్ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రాంతానికి చెందినటువంటి పెరంబవూరు పెరంబూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే తమిళంలో పలు సీరియళ్లలో నటిస్తూ అలాగే పలు టివి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి రేఖ భర్త అయినటువంటి గోపీనాథ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళ సినీ పరిశ్రమలో విషాద నెలకొల్పింది.
స్థానికుల వివరాల మేరకు గోపీనాథ్ ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు.వీరిద్దరూ పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే జీవితంలో అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో గోపీనాథ్ వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపడంతో రేఖ జీవితంలో కలకలం మొదలైంది.ఈ విషయమై తరచూ గొడవలు కూడా పడే వారని తెలుస్తోంది.
అయితే ఈ విషయానికి సంబంధించి గురువారం రోజున కూడా గొడవ జరిగింది దీంతో మనస్తాపానికి గురైన గోపీనాథ్ తను పని చేస్తున్నటువంటి కార్యాలయంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే మరుసటి రోజున అక్కడ పని చేస్తున్నటువంటి ఉద్యోగులు కార్యాలయం తలుపులు తెలియడానికి ప్రయత్నించగా లోపల విగతజీవిగా పడి ఉన్నటువంటి గోపీనాథ్ ను చూసి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే గోపినాథ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
.