ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో ఎలా బంధీ అయిందో చూస్తూనే ఉన్నాం.ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆఫ్గనిస్తాన్ను చూసి జాలిపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
ఇక చాలామంది ప్రముఖులు ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ను విడిచి వెళ్లిపోతున్నారు.సెలబ్రిటీలు కూడా వేరే దేశానికి పయనమవుతున్నారు.
ఇక ప్రముఖ పట్టణమైన కాబూల్ నగరాన్ని ఇప్పుడు తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో చాలామంది పారిపోయినట్టే ఈ దేశం విడిచి పారిపోయిన ప్రముఖ ఆఫ్ఘన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అవేంటంటే తమ దేశాన్ని నాశనం చేస్తున్న తాలిబన్ టెర్రరిస్టులకు పాకిస్తాన్ దేశం అండగా ఉంటోందని వ్యాఖ్యానించింది.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆప్ఘన్ దేశానికి ఇండియా ట్రూ ఫ్రెండ్ అంటూ కూడా చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె ఎక్కడో అజ్ఞాత ప్లేస్ లో ఉంటూ ఈ విధంగా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి కామెంట్లు చేసింది.
ప్రస్తుతం అఫ్గానిస్తాన్ ను ఇంతలా నాశనం చేస్తూ తాలిబన్లు వశం చేసుకోవడంలో ప్రముఖంగా పాకిస్తాన్ దేశం పాత్ర చాలానే ఉందంటూ ఆరోపించింది.ఈ మేరకు ఇలాంటి ఘటనలు ఎన్నో చూశామని తెలిపింది.
ప్రస్తుతం పాకిస్తాన్ ఇస్తున్న ఇలాంటి దారుణమైన ఆదేశాలతోనే తాలిబన్లు ఇలాంటి దురాహతాలకు పాల్పడుతున్నారంటూ మండిపడింది.తాలిబన్లకు ప్రస్తుతం నేరాలు చేయడంలో పాకిస్తాన్ ట్రైనింగ్ ఇస్తోందంటూ వ్యాఖ్యానించింది.ఇప్పటికీ కూడా తాలిబన్లకు చెందిన అనేక స్థావరాలు పాకిస్తాన్ లో సజీవంగా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇంకో అడుగు ముందుకేసి పాకిస్తాన్ దేశమే తాలిబన్లకు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తోందంటూ ఆరోపించింది.
ప్రత్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.చూడాలి మరి తాలిబన్లు ఎలా రియాక్ట్ అవుతారో.
ఏదేమైనా పాప్ స్టార్ది చాలా పెద్ద ధైర్యమే అని చెప్పాలి.