తెలుగు బుల్లితెరపేక్షకులకు హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలుషోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూనే ఒకవైపు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా పూర్ణకు నటిగా కంటే జడ్జిగానే మంచి గుర్తింపు దక్కింది.ఢీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
అయితే టీవీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న సమయంలో పద్ధతిగా చీర కట్టుకొని కనిపించే పూర్ణ సోషల్ మీడియాలో మతం హాట్ ఫోటో షూట్లతో కొర్రకాలను ఆకర్షిస్తూ ఉంటుంది.పైగా ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ లో కనిపిస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో పూర్ణ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో దృశ్యం 2, అఖండ, తలైవీలాంటి సినిమాలతో మంచి మంచి విజయాలను అందుకుంది.
మరియు ముఖ్యంగా అఖండ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది.ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
అయితే ఈమె కొన్ని బోల్డ్ సీన్లలో నటించినప్పటికీ ఆమె క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా పూర్ణ అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఇటీవల అనుకోకుండా ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది పూర్ణ.
విదేశాలకు వెళ్లేందుకు వీసాలను కూడా అందించే సంస్థని నిర్వహిస్తున్న షానిద్ ఆసిఫ్ అలీ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది పూర్ణ.దీంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురయ్యారు.అంతేకాకుండా పూర్ణ మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది నవంబర్ 9న షానిద్ ఆసిఫ్ అలీతో మ్యారేజ్ జరగబోతున్నట్లు వెల్లడించింది.ఇది పెద్దలు కుదిరించిన సంబంధం అనే ఆమె తెలిపింది.
అయితే పెళ్లి తర్వాత ఆమె దుబాయ్ వెళ్లిపోతాను అంటూ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాను అన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది.