కమెడియన్ గా కెరియర్ ప్రారంభించి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సునీల్.కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే అందాల రాముడు సినిమాతో హీరోగా మారి హిట్ కొట్టాడు.
తరువాత మర్యాదరామన్న, పూలరంగడు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకొని పూర్తి స్థాయి హీరోగా మారిపోయి కమెడియన్ పాత్రలకి స్వస్తి చెప్పేశాడు.తరువాత హీరోగానే సినిమాలు చేస్తూ వచ్చాడు.
అయితే ఆ మూడు సినిమాల తర్వాత మళ్ళీ ఒక్క కమర్షియల్ హిట్ కూడా సునీల్ కి పడలేదు.దీంతో హీరోగా అతని ఇమేజ్ పడిపోయిది.
ఇక తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాడు.ఇక డిస్కోరాజా, కలర్ ఫోటో సినిమాలతో విలన్ గా కూడా మెప్పించాడు.
ఇక పుష్ప సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది.ఇదిలా ఉంటే ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే హీరోగా కూడా సునీల్ సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో లాక్ డౌన్ కి ముందు ఎనౌన్స్ అయిన వేదాంతం రాఘవయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం తాజాగా జరిగింది.సునీల్ మెయిన్ లీడ్ లో చేస్తున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ కథ అందించాడు.
చంద్రమోహన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక 14 రీల్స్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సునీల్ కి జోడీగా పూర్ణ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.చాలా కాలం తర్వాత మరల వరుస సినిమాలతో ఈ భామ బిజీ అవుతుంది.
తాజాగా బ్యాక్ డోర్ అనే సినిమాని పూర్తి చేసింది.బాలకృష్ణ, బోయపాటి సినిమాలో నటిస్తుంది.
ఇప్పుడు వేదాంతం రాఘవయ్య కోసం సునీల్ తో జత కడుతుంది.