ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ తో చేస్తున్న చిత్రం యొక్క షూటింగ్ శెర వేగంగా జరుగుతుంది.అయితే ఈ చిత్రానికి సంబందించిన వార్త ఒకటి ఇప్పుడు టాలీవుడ్ లో హల్చల్ చేస్తుంది.
ఇప్పటికే ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హసన్ హీరోయిన్ గా చేస్తూ ఉండగా, మరో భామ కీలక పాత్ర పోషించనుంది అని టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.వినిపిస్తున్న వార్తల ప్రకారం.
ఈ చిత్రంలో పల్లెటూరు వాతావరణంలో ఒక పాత్ర ఉండబోతుంది అని, ఇక ఆ పాత్రలో నృత్య నటిగా నటించే అమ్మాయి కోసం దర్శకుడు ఆలోచిస్తూ ఉండగా అందరూ దర్శకుడికి “అవును” చిత్రంలో నటించిన పూర్ణ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ పాత్ర సినిమాకు చాలా కీలకం అని, మహేష్ పాత్రకు ఈ పాత్ర ట్విస్ట్ ఇచ్చే పాత్ర అని తెలుస్తుంది.
అయితే పూర్ణ నే నటిగా ఈ పాత్రకు తీసుకోవడానికి ముఖ్య కారణం ఆమె కథక్ డ్యాన్సర్ గా పేరు తెచ్చుకున్న కళాకారిణి అవ్వడమే అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం ఈ భామ జ్యాక్ పాట్ కొట్టినట్లే మరి.