శ్రీహరి మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన సీమటపాకాయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూర్ణ. ఈ మలయాళీ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది.
తరువాత రవిబాబు దృష్టిలో పడి అతను తీసిన అవును, అవును 2 సినిమాల ద్వారా పాపులర్ అయ్యింది.తెలుగులో ఈ భామ చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకులకి మాత్రం బాగానే చేరువ అయ్యింది.
స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకుంటే ఏదో అలా చిన్న సినిమాలతో సరిపెట్టుకుంది.ఇతర బాషలలో కూడా పూర్ణ కెరియర్ ఇలాగే ఉంది.
అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది.అయితే అందరిలా హీరోయిన్ పాత్రలే చేయాలనే పట్టుబట్టకపోవడంతో ఆమెకి అప్పుడప్పుడు మంచి పాత్రలు చేసే అవకాశం వస్తుంది.
ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో జడ్జ్ గా సందడి చేస్తున్న పూర్ణ చాలా గ్యాప్ తర్వాత మరల ఓ ఇంటరెస్టింగ్ మూవీకి ఒకే చెప్పింది.
పూర్ణ చివరిగా సువర్ణ సుందరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా తెలియదు.పూర్ణ కథానాయికగా కర్రి బాలాజీ దర్శకత్వంలో బ్యాక్ డోర్ సినిమా చేస్తుంది.
తాజాగా ఈ సినిమాకి సంబందించిన పూజా కార్యక్రమాలు జరుపుకొని లాంఛనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ బ్యాక్ డోర్ ఎంట్రీ అన్నది చాలా సహజంగా జరుగుతున్నది.
అటువంటి బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని తెలిపారు.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించి, శరవేగంగా చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.