మలయాళంలో తెరకెక్కిన దృశ్యం 2 చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ అయ్యి అదిరిపోయే హిట్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా సక్సెస్తో తెలుగులో కూడా దృశ్యం సీక్వెల్ను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
దీంతో ఈ సినిమాను ఇటీవల అఫీషియల్గా స్టార్ట్ కూడా చేశారు.కాగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా, దృశ్యం చిత్రంలో నటించిన నటీనటులే ఈ సీక్వెల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఓ బ్యూటీ మాత్రం ఇప్పుడు దృశ్యం సీక్వెల్ చిత్రంలో జాయిన్ అయినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.హీరోయిన్గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న పూర్ణ, ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఆమెను ఈ సినిమాలోని ఓ అదిరిపోయే రోల్లో నటించేందుకు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారట.దీంతో వెంటనే పూర్ణా కూడా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే దృశ్యం 2 చిత్రంలో అమ్మడు నటించబోయే పాత్ర ఏమిటా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.ఏదేమైనా పూర్ణా ఈ సినిమాలో నటిస్తుండటంతో ఆమె పాత్రకు సంబంధించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
ఇక ఈ సినిమాను కూడా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.కాగా మీనా ఈ సినిమాలో వెంకీ భార్య పాత్రలో మరోసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
మరి సీక్వెల్ చిత్రాల కింగ్ అయిన వెంకటేష్, దృశ్యం సీక్వెల్తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే దృశ్యం 2 చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి అంంటున్నారు సినీ ప్రేమికులు.