బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు కొన్నిసార్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తుంటాయనే సంగతి మనకు తెలిసిందే.కొందరు కంటెస్టెంట్ లు వారి స్కిట్ లో భాగంగా చేసే పనులు, మాట్లాడే తీరుపలు వివాదాలకు కారణం అవుతుంది.
ఇక ఈ విధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో “ఢీ”కార్యక్రమంలో ఇలాంటి అరాచకాలు మరెన్నో ఉంటాయని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి పూర్ణ, ప్రియమణి వంటి హీరోయిన్స్ న్యాయనిర్ణేతలుగా ఉన్నారు.
జడ్జ్ అంటే కేవలం కంటెస్టెంట్ చేసే ఫర్ఫార్మెన్స్ బట్టి వారికి మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది.కానీ అన్ని షోల జడ్జీల కంటే ఢీ షో జడ్జీల తీరు వేరయా అన్నట్టుగా ఉంటుంది వీరి వ్యవహార శైలి.
కంటెస్టెంట్ చేసే పర్ఫామెన్స్ కు జడ్జిమెంట్ ఇవ్వడమే కాకుండా వారికి ముద్దులు, హగ్గులు అంటూ రెచ్చిపోతోంటారు హీరోయిన్ పూర్ణ.ఇదివరకే ఎంతోమంది కంటెస్టెంట్ లకు ఆమె ముద్దులు పెట్టడం, హగ్గులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.ఈ ప్రోమోలో భాగంగా పూర్ణ మరి కాస్త శ్రుతిమించి వ్యవహరించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే చైతన్య మాస్టర్ చేసిన పర్ఫామెన్స్ కు ముగ్ధురాలైన పూర్ణ తన సీట్లో నుంచి లేచి వెళ్లి అతడి బుగ్గలను కోరికేసింది.ప్రస్తుతం ఈ ప్రోమో ఎన్నో విమర్శలకు దారి తీస్తోంది.
ఈ ప్రోమో చూసిన నెటిజన్లు పూర్ణ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆ ముద్దులు ఏంటో… ఆ బుగ్గ కొరకడాలు ఏంటో అంటూ ఆమెపై విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలోనే మరికొందరు నెటిజన్లు ఇలా మగాడి బుగ్గలు కొరికే మానసిక రోగం పూర్ణకు ఉందేమో అంటూ పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నార
.