ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పూనమ్ కౌర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.పోసాని కృష్ణమురళి పంజాబీ బ్యూటీ పేరుతో నిజంగా పూనమ్ గురించి కామెంట్లు చేశారో లేదో తెలియదు కానీ పూనమ్ కౌర్ కు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు తెగ వైరల్ కావడం గమనార్హం.
మరోవైపు పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులను నెటిజన్లను తమదైన శైలిలో అర్థం చేసుకుంటున్నారు.
రెండు రోజుల క్రితం ప్రకాష్ రాజ్ గెలిస్తే సమస్యలను చెప్పుకుంటానని చెప్పిన పూనమ్ కౌర్ తాజాగా సిద్దార్థ్ చేసిన ట్వీట్ గురించి స్పందిస్తూ నిజమే అని కామెంట్ పెట్టారు.
సిద్దార్థ్ ట్వీట్ ను చేసిన రీట్వీట్ చేసిన పూనమ్ కౌర్ మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగు పడరని చిన్నప్పుడు స్కూల్ లో టీచర్ దగ్గర అదే నేర్చుకున్నానని మరి మీరేం నేర్చుకున్నారంటూ సిద్దార్థ్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసి నిజమేనని పేర్కొన్నారు.
అయితే పూనమ్ కౌర్ చేసిన కామెంట్ వల్ల చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియాలో పూనమ్ పేల్చిన డైలాగ్ ఎవరిని ఉద్దేశించి చెప్పిందో ఎవరికీ అర్థం కావడం లేదు.పూనమ్ కౌర్ తన లైఫ్ లో జరిగిన విషయాల గురించి ట్వీట్స్ ద్వారా వెల్లడించారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మరోవైపు మా ఎన్నికల తర్వాత పూనమ్ ఏం చెబుతారో చూడాల్సి ఉంది.
పూనమ్ కౌర్ సినిమాలలో స్టార్ హీరోయిన్ కావడానికి అన్ని లక్షణాలు ఉన్నా స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయారు.పూనమ్ కు సినిమా ఆఫర్లు కూడా రావడం లేదు.పూనమ్ పోసాని అనుకూలంగా చెబుతారో లేక పవన్ కు అనుకూలంగా చెబుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.