మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన పూనమ్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించారు.హైదరాబాద్ లో జన్మించిన పూనమ్ కౌర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును పూనమ్ కౌర్ పూర్తి చేశారు.2005 సంవత్సరంలో పూనమ్ కౌర్ మిస్ ఆంధ్రా టైటిల్ ను గెలుచుకున్నారు.మాయాజాలం సినిమాతో నటిగా పూనమ్ కౌర్ కెరీర్ మొదలైంది.
అయితే మాయాజాలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ఆ తర్వాత ఒక విచిత్రం, శౌర్యం, వినాయకుడు, గణేష్, నాగవల్లి, గగనం, బ్రహ్మి గాడి కథ, ఆడు మగాడ్రా బుజ్జీ పలు సినిమాల్లో పూనమ్ కౌర్ నటించారు.అయితే తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో పోసాని కృష్ణమురళి పంజాబీ అమ్మాయి అంటూ చేసిన కామెంట్లు పూనమ్ కౌర్ ను ఉద్దేశించినవే అని చాలామంది భావిస్తున్నారు.
అయితే పూనమ్ కౌర్ మాత్రం ఈ వివాదం గురించి ప్రత్యక్షంగా స్పందించడానికి ఇష్టపడటం లేదు.
అయితే పూనమ్ కౌర్ పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.సినిమా రంగంలో గురువు అంటే దాసరి గారు మాత్రమేనని పూనమ్ కౌర్ ఒక పోస్టులో పేర్కొన్నారు.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక మహిళ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో షేర్ చేశారు.
ఆ వీడియోలో మహిళ తాను రేప్ కు గురయ్యానని అందరూ తన శీలం పోయిందని అన్నారని చెప్పుకొచ్చారు.తన సిగ్గు పోయిందని కూడా అన్నారని మహిళ వీడియోలో చెప్పుకొచ్చారు.సిగ్గు పడాల్సింది వాడని నేను కాదని మహిళ పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి పూనమ్ ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.