తెలుగు సినిమాలలో అడపాదడపా కనిపించిన పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తను చేసే ట్వీట్లు ద్వారా ఎంతో వివాదాన్ని రేకెత్తిస్తుంది.ఆమె ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేస్తుందో అందరికీ తెలుసు, కానీ ఫలానా అని పేరు మాత్రం చెప్పకుండానే వివాదాన్ని రేపుతుంది.
తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కి స్పందించి, తాను ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు తన మద్దతు తెలుపుతూ సంఘీభావాన్ని ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని ట్వీట్లు లతో వివాదాస్పదంగా మారాడు.
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ ను ఊసరవెల్లి అంటూ ప్రకాష్ రాజ్ సంబోధించడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.తాజాగా ఈ ఘటనపై పూనమ్ కౌర్ స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఏ యాక్టర్, పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడితే పెద్దపెద్ద హెడ్డింగులు వేసి చూపిస్తారు.
కానీ తను రైతులకు మద్దతుగా మాట్లాడితే మాత్రం వాటిని హైలెట్ చేయకుండా కవర్ చేశారంటూ మండిపడింది.
తాజాగా ప్రకాష్ రాజ్ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా నిలిచిన సంగతి గురించి పూనమ్ కౌర్ తాజాగా స్పందించారు.ఈ విధంగా రైతులకు మద్దతు తెలుపుతూ వారి ఆవేదనను తెలుసుకోవాలని కోరింది.ఈమె చేసిన ఈ ట్వీట్ ద్వారా యాక్టర్, రాజకీయ నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ పేరు బయట పెట్టకనే పెట్టిందని చెప్పవచ్చు.
పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలకు ఒకవైపు మెగా బ్రదర్ నాగబాబు స్పందించి ప్రకాష్ రాజ్ కు భారీ కౌంటర్ వేశారు.మరొకవైపు పెద్ద ఎత్తున మెగా అభిమానులు ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డారు.
అదే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రైతుల గురించి మాట్లాడి, రైతులకు సంఘీభావం తెలిపితే మీడియా ఎందుకు హైలెట్ చేయలేదంటూ.ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.