దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు కొత్త చట్టాలు వెనక్కి తీసుకోవాలని పంజాబ్ రైతులు మొదలుపెట్టిన ఈ ఉద్యమం మెల్లమెల్లగా అన్ని రాష్ట్రాల రైతులను కదిలించి పెద్ద ఉద్యమంగా మారింది.
ఇలాంటి తరుణంలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన హీరోయిన్ పూనమ్ కౌర్ రైతుల ఉద్యమాన్ని ఉద్దేశించి సోషల్ మీడియా కీలక కామెంట్లు పెట్టింది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ అదేవిధంగా వైయస్సార్ తలపాగాలు ధరించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఫార్మర్ మిస్ యూ అని కామెంట్ పెట్టింది.ఇదే తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రస్తావన కూడా తీసుకు వస్తూ ఆయనంటే గౌరవమని తెలిపింది.అదేవిధంగా మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, కేప్టెన్ అమరీందర్ సింగ్ పేర్లను తన పోస్టులో ప్రస్తావించడం జరిగింది.
ప్రతి ఒక్కరు రాజకీయ కారణాలు పక్కనబెట్టి రైతుల సమస్యలను సామరస్య వాతావరణంలో పరిష్కరించాలని కోరింది.చాలా వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమంలో పోలీసుల చేతిలో దెబ్బతింటుంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు కావటంతో.
ఆమె భావోద్వేగానికి గురి అయ్యి ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
.