టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పరిచయం అందరికి తెలిసిందే.మాయాజాలం సినిమాతో తొలి సారిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
ఇక ఈమె సినిమాలలో అంత సక్సెస్ ను తన ఖాతాలో వేసుకొలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక ఈమె చేసే ట్వీట్ ల గురించి మాత్రం ఎంత చెప్పిన తక్కువే.
ఒక్కోసారి ఈమె చేసే ట్వీట్ లు తరచూ వివాదంగా మారుతాయి.
కొన్ని ఉద్దేశపూర్వకంగా ఉంటాయి.సమాజంలో జరిగే విషయాలపై బాగా స్పందిస్తోంది పూనమ్.
ఈమె సోషల్ మీడియాలో అడుగుపెట్టిందంటే చాలు.ఏదో ఒక కౌంటర్ తో వివాదాలోకి వస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా చెత్త రాజకీయాలు అంటూ మళ్లీ రంగంలోకి దిగింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పూనమ్ ప్రభుత్వంపై, రాజకీయాలపై కౌంటర్లు వేసింది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకి దారుణంగా మారుతున్న సమయంలో.రాజకీయ నాయకులు వారి రాజకీయాల విషయంలో తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఎటువంటి స్పందన లేకపోయేసరికి వారిపై కామెంట్స్ చేసింది.
కొందరు బాధపడుతూ ఉంటే.వాటివల్ల మరి కొందరు సుఖ పడుతున్నారని, కానీ బాధ పడే వారి పరిస్థితి గురించి ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఇలాంటి చెత్త రాజకీయాల్లో అలాగే ఉంటుందని.
ఒకరి కష్టం మరొకరికి సుఖంగా మారుతుందని తెలిపింది.అంతేకాకుండా ఎవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళు సైలెంట్ గా చేసేస్తున్నారని, వాళ్ళే నిజమైన హీరోలని తెలిపింది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి రాజకీయ నాయకుల నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి పూనమ్ కౌర్ వారిపై ఈ విధంగా కామెంట్స్ చేసింది.