తెలుగు చలన చిత్ర రంగానికి చెందిన నటుడు కత్తి మహేష్ ఈరోజు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద తెల్లవారుజామున కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అవ్వగా.
కత్తి మహేష్ కు స్వల్ప గాయాలయ్యాయి.ఇక వెంటనే నెల్లూరు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మళ్లీ అక్కడి నుండి మరో ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కత్తి మహేష్ కు వైద్యం జరుగుతుండగా ఆయన కోమా దశలో ఉన్నాడని మరో మూడు రోజుల వరకు ఆయన పరిస్థితి ఏమీ చెప్పలేం అంటూ వైద్యులు తెలుపుతున్నారని సమాచారం.ఇక ఈయనకు జరిగిన ప్రమాదం పట్ల సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా కత్తి మహేష్ గురించి తెలుగు సినీ నటి పూనమ్ కౌర్ కౌంటర్లు వేయడం తో ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
తెలుగు సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈమె హీరోయిన్ గా కంటే సోషల్ మీడియాలో చేసే ట్వీట్ లతో మరింత గుర్తింపు అందుకుంది.తన ట్వీట్ లు తరచు వివాదానికి దారి తీస్తాయి.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఏదో ఒక విషయం తో తెగ కౌంటర్లు వేస్తుంది.
ఇక కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ పట్ల విమర్శలు బాగా చేస్తుంటాడు.
అంతే కాకుండా మధ్యలో పూనమ్ కౌర్ పేరును కూడా లాగుతుంటాడు కత్తి మహేష్.
దీంతో పూనమ్, కత్తి మహేష్ కు మధ్య వివాదాలు కూడా ఎదురయ్యాయి.ఇక తాజాగా ఆయన యాక్సిడెంట్ గురించి పరోక్షంగా కామెంట్ చేసింది పూనమ్.తన సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ చేయగా.
కర్మ దేవోభవ అంటూ రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్లుగా వాడుకున్నావు, వదిలేసావు అంటూ.ఏళ్ల నుంచి పద్ధతిగా నా పని మాత్రమే చేసుకునే బ్రాహ్మణ అమ్మాయిని కోరుకుంటున్నాను అని నువ్వు ప్రాణాలతో బయట పడాలని కోరింది.
ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావని, ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో అంటే జైశ్రీరామ్ అని కౌంటర్ వేసింది.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.