కమల్ హాసన్ కి జోడీగా విశ్వరూపం, విశ్వరూపం2, ఉత్తమ విలన్ సినిమాలలో నటించిన నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ మూడు సినిమాలు పూజా కుమార్ కి ఇండియాలో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఈ అమ్మడు తెలుగులో రాజశేఖర్ కి జోడీగా గరుడవేగా సినిమాలో నటించింది.వీటికంటే ముందుగా ఆమె డజనుకి పైగా హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది.
ఇండో-అమెరికన్ నటి అయిన ఈమె స్టేజ్ ఆర్టిస్ట్ గా అమెరికాలో కెరియర్ స్టార్ట్ చేసి హాలీవుడ్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చి అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.కాదల్ రోజావే అనే తమిళ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమెకి కమల్ హాసన్ విశ్వరూపం ద్వారానే ఇండియన్ వైడ్ గా గుర్తింపు వచ్చింది.
అయితే ఈ భామ ఇప్పుడు సినిమాలకి స్వస్తి చెప్పి అమెరికాలో తాను ప్రేమించిన వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.తాజాగా వారికి ఒక కూతురు కూడా పుట్టింది.
ఇక పూజా కుమార్ భర్త తన కూతురుని, భార్యని అధికారికంగా ప్రపంచానికి పరిచయం సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు.
పూజా భర్త విశాల్ తన కూతురు ఫోటో షేర్ చేసి.ఇదివరకు మేము ఇద్దరమే.కానీ ఇప్పుడు మేము ముగ్గురం.
పూజా నేను మా కూతురు నావ్య జోషిని మీ అందరికి పరిచయం చేస్తుంనందుకు చాలా సంతోషిస్తున్నాము.నేను కలలు కన్న ఉత్తమ జీవిత భాగస్వామిగా నా బుజ్జి కూతురు నావ్యను ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చినందుకు భార్య పూజాకు ధన్యవాదాలు.
ఈ పుట్టినరోజును నా ఉత్తమ పుట్టినరోజుగా చేసుకున్నాను.మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను అంటూ తన కూతురు భార్య పై ప్రేమను విశాల్ తెలియజేశాడు.
ఇక విశాల్ జాయ్ మ్యారేజ్ మేనేజ్మెంట్ సంస్థ జాయ్ కి సిఈఓగా ఉన్నారు.వీరు అమెరికాలోనే ఉంటున్నట్లు తెలుస్తుంది.
ఆమె చివరిగా ఇండియాలో ప్రియదర్శిని దర్శకత్వంలో వచ్చిన అనామిక వెబ్ సిరీస్ లో కనిపించింది.ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఫ్యామిలీ లైఫ్ ని పూజా లీడ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.
.