టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ ఇప్పటికే రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాలను రిలీజ్కు రెడీ చేసింది.
అంతేగాక ప్రస్తుతం ఆమె తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాపై అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది ఈ బ్యూటీ.
ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతుందని పూజా చెప్పుకొచ్చింది.
అయితే పూజాకు మాత్రం ఎప్పటినుండో ఓ పాత్ర చేయాలని చాలా కోరికగా ఉందట.
ఆమెకు యాక్షన్ సీక్వెన్స్ ఉన్న పాత్రలో నటించాలని ఎప్పటినుండో ఆశగా ఉన్నా, ఇప్పటివరకు అలాంటి పాత్ర లభించలేదని తెలుస్తోంది.అయితే బీస్ట్ చిత్రంలోనైనా తనకు అలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సీన్ లభిస్తుందేమోనని ఆశపడుతోంది ఈ బుట్టబొమ్మా.
ఇక తెలుగులో రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాల్లో అమ్మడి పాత్ర రొమాంటిక్ యాంగిల్లో ఉంటుందని, ఆ రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి పేరును తీసుకురావడం ఖాయమని ఆమె అంటోంది.
మరి పూజా హెగ్డేకు ఎంతో ఇష్టమైనా యాక్షన్ సీక్వెన్స్ పాత్ర ఎప్పుడు లభిస్తుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.
కాగా ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్కు జోడీగా కేమియో పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ గతేడాదిలో అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకుంది.
ఇక అటు బాలీవుడ్లోనూ అమ్మడు తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది.మిగతా హీరోయిన్లకు దొరికినట్లుగా అమ్మడికి యాక్షన్ రోల్స్ దొరికితే బాగుంటుందని, అందులోనూ బుట్టబొమ్మ తన సత్తా చాటడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.