సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే.ఈ అమ్మడు చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్, రాదేశ్యామ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
అలాగే సౌత్ లో మరో క్రేజీ హీరోయిన్ గా రష్మిక మందన దూసుకుపోతుంది.ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది.
మరో వైపు పూజా హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్, రణబీర్ సింగ్ తో రెండు సినిమాలు చేస్తుంది.ఇక రష్మిక మందన హిందీలో సిద్ధార్ద్ మల్హోత్రాతో ఒక సినిమా, అలాగే అమితాబచ్చన్ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తుంది.
ఇలా ఈ ఇద్దరు కన్నడ కుట్టీల మధ్య సౌత్ లో, అలాగే నార్త్ లో సినిమాల విషయంలో సవత్తరమైన పోటీ నడుస్తుందని చెప్పాలి.అయితే ఈ రేసులో పూజా హెగ్డే ముందు వరుసలో ఉంది.
ఆమె వరుస పాన్ ఇండియా సినిమాలు, స్టార్ హీరోలతోనే జత కడుస్తుంది.రష్మిక మందన మహేష్ బాబుతో, ఇప్పుడు అల్లు అర్జున్ తో జతకట్టి స్టార్ హీరోల ఛాయస్ గా మారే ప్రయత్నంలో ఉంది.
ఇక కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ దిలీప్ రష్మిక మందన, పూజా హెగ్డే పేర్లు పరిశీలించారు.అయితే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తూ ఉండటం వలన పూజా హెగ్డే అయితే బెటర్ అని ఆమెని కన్ఫర్మ్ చేసుకున్నారు.దాంతో పాటు ఆమె అడిగినంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చేశారు.రష్మిక చేతికి ఈ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.అయినా కాని సుల్తాన్ సినిమాతో రష్మిక కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.దీని తర్వాత సూర్య హీరోగా తెరకెక్కబోయే ఓ సినిమా కోసం రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
ఇక ఆ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు ఉన్నాడు.సౌత్ హీరోలు మార్కెట్ ని పెంచుకునే క్రమంలో పాన్ ఇండియా కథలకి పచ్చజెండా ఊపడంతో దర్శకులు ఆ తరహా కథలు సిద్ధం చేసుకొని వారికి వినిపిస్తున్నారు.
ఈ నేపధ్యంలో హీరోయిన్స్ కూడా ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని బాషలలో తమ ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రయత్నంలో రష్మిక, పూజా హెగ్డే ఇద్దరూ కూడా పాన్ ఇండియా హీరోయిన్స్ అనిపించుకోవడానికి ఒకరితో ఒకరు గట్టిగా పోటీ పడుతున్నారని హాట్ టాక్ నడుస్తుంది.