టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మంగళూరు భామ పూజా హెగ్డే. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో ఈ అమ్మడు ముందు వరుసలో ఉంది.
మరో వైపు బాలీవుడ్ లో కూడా మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అక్కడ కూడా పాగా వేయడానికి రెడీ అవుతుంది.ఇదిలా ఉంటే టాలీవుడ్ కి భవిష్యత్తులో షూటింగ్ హబ్ గా విశాఖపట్నం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.
త్వరలో రాజధానిగా కూడా మారుతున్న విశాఖలో భూములకి ఇప్పటికే రెక్కలు వచ్చాయి.టాలీవుడ్ స్టార్స్ అందరూ విశాఖలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
మరో ముంబై నగరంగా భవిష్యత్తులో విశాఖ మారే అవకాశం ఉంది.సౌత్ సినిమాలకి విశాఖ మూవీ జోన్ గా మారే అవకాశం కనిపిస్తుంది.
ఈ నేపధ్యంలో మంగళూరు, ముంబై వాతావరణంకి అలవాటు పడిన పూజాహెగ్డే విశాఖలో కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ భూములు కొనడానికి పూజ హెగ్డే ట్రై చేస్తుందని అంటున్నారు.ఒక అగ్ర హీరో ద్వారా ఆమె ఈ ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.
విశాఖ లో ఫాషన్ బిజినెస్ ప్లాన్స్లో భాగంగా అమ్మడు అడుగులు వేస్తుందని వార్తలు వస్తున్నాయి.రుషి కొండ ప్రాంతంలో రెండు ఎకరాలు కొనాలని చూస్తున్నట్టు సమాచారం.త్వరలోనే ఆమె విశాఖ కూడా వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు రుషికొండ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసుకొని ఉన్నారు.
అందాల భామలకి కూడా అక్కడ విల్లాలు ఉన్నాయి.ఇప్పుడు పూజా హెగ్డే కూడా విశాఖ మీద మనసు పడిందని తెలుస్తుంది.
.