స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తనకు కరోనా నిర్ధారణ అయినట్టు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఆరు సినిమాలు ఉండగా పూజా హెగ్డేకు కరోనా సోకడంతో ఆయా సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి.
ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పూజా హెగ్డే యోగా సెషన్స్ లో పాల్గొంటూ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాయామం చేస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు.
ప్రాణాయామం వల్ల మెరుగైన శ్వాసను తీసుకోవడం సాధ్యమవుతుందంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా పూజా హెగ్డే ఒక హాట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.పూజా హెగ్డే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా హాట్ ఫోటోను షేర్ చేయగా ఆ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జాకెట్ బటన్స్ విప్పేసి ఎద అందాలు కనిపించే విధంగా పూజా హెగ్డే ఫోటోను షేర్ చేశారు.
కరోనా సోకి ఇంటికే పరిమితమైనా సోషల్ మీడియాలో మాత్రం హవా తగ్గకుండా పూజా హెగ్డే జాగ్రత్త పడుతున్నారు.
అయితే ఈ ఫోటోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు నెటిజన్లు ఈ ఫోటో గురించి పాజిటివ్ గా స్పందిస్తుంటే ఎక్కువమంది కరోనా సమయంలో ఇలాంటి ఫోటోలు అవసరమా.? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
సినిమాల్లో గ్లామరస్ గా కనిపించే పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా గ్లామరస్ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో మూడు మూడు సినిమాలు ఉండగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్ లు దాదాపుగా పూర్తి కాగా కరోనా విజృంభణ తగ్గితే ఈ సినిమాల షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.