టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పూజా హెగ్డే తనదైన మార్క్ వేసుకుని దూసుకుపోతంది.ఇప్పటికే పలు సెన్సేషలన్ సినిమాల్లో నటించిన పూజా హెగ్డే రీసెంట్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో నటించగా అది బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్తో తన నెక్ట్స్ చిత్రాలను క్యూలో పెట్టింది ఈ బ్యూటీ.
ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తు్న్న ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తున్న పూజా, మరో యంగ్ హీరో అక్కినేని అఖిల్తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలోనూ నటిస్తోంది.
ఈ రెండు సినిమాలతో తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేయాలని చూస్తున్న పూజా, వరుసబెట్టి వస్తున్న ఆఫర్లను చాలా నెమ్మదిగా ఓకే చేస్తోంది.అయితే దీని వెనకాల ఓ బలమైన కారణం ఉందని తెలుస్తోంది.
పూజా ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తోందట.
తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న పూజా, దీనికి సంబంధించిన పనులు మొదులపెట్టేందుకు రెడీ అవుతోంది.
దీని కోసమే సినిమాలకు తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా పూజా ఫుల్ ఫ్లెడ్జ్గా బిజినెస్ వ్యవహారాలు చూసుకునేందుకే ఎక్కువ ఇష్టపడుతోందట.
మొత్తానికి వ్యాపారం చేసుకునేందుకు రెడీ అవుతున్న పూజా, సినిమాలకు తక్కవ సమయం ఇస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.