టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన అందాల భామ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.గతేడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం పలు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉంది.
తాజాగా ఆమె నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రంతో రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తో రొమాన్స్ చేస్తున్న పూజా మరోసారి భారీ విజయాన్ని అందుకునేందుకు రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాతో పాటు అక్కినేని యంగ్ హీరో అఖిల్తో నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో కూడా పూజా నటిస్తోంది.
ఈ సినిమాను కూడా వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమా తరువాత పూజా హెగ్డే మరో అక్కినేని హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.గతంలో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన పూజా హెగ్డో, మరోసారి చైతూతో కలిసి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
వైవిధ్య చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఓకే కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఈ అంశానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.ఇలా వరుసగా అక్కినేని సోదరులతో రొమాన్స్ చేస్తున్న పూజా, సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తోంది.
అటు రెమ్యునరేషన్ పరంగా కూడా పూజా హెగ్డే భారీ మొత్తంలో పుచ్చుకుంటుండటంతో ఆమె డేట్స్ కోసం భారీ చిత్రాల దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లోనూ వరుస సినిమాలతో పూజా పాప యమ బిజీగా మారింది.