అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే.ఈ బ్యూటీ తమ సినిమాల్లో నటించాలని చాలా మంది దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.
కాగా ఈ బ్యూటీ ఇటీవల నటించిన అల వైకుంఠపురములో బ్లాక్బస్టర్గా మారడంతో తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేస్తోంది ఈ బ్యూటీ.అక్కినేని వారసుడు అఖిల్ సరసన ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది.
అయితే తమిళంలో ఈ బ్యూటీ తన రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన అడుగులు కూడా వేస్తోంది.తమిళ స్టార్ హీరో విజయ్ 65వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను గురు చిత్ర దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు అప్పుడే మొదలైంది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.
గతంలో పూజా హెగ్డే మూగమూడీ అనే సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది ఫ్లాప్ మూవీగా నిలిచింది.
దీంతో పూజా హెగ్డే కోలీవుడ్లో మరే సినిమా చేయలేదు.కాగా ఇప్పుడు మళ్లీ కోలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వనున్న పూజాకు ఎలాంటి హిట్ దక్కుతుందో అని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.