టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.ఈమె ప్రెసెంట్ సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
వరుస అవకాశాలను అందుకుంటూ అత్యధిక పారితోషికం కూడా తీసుకుంటుంది.ఈమె ఏ సినిమా చేసిన కూడా సూపర్ హిట్ అవుతుంది.
ఇక ఈ మధ్యనే ఈమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈమె ప్రెసెంట్ టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.
పూజా హెగ్డే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది.ఈ సినిమాలో నీలాంబరి పాత్రలో మరొక సారి అందరిని మెప్పించడానికి రెడీ అవుతుంది.
ఇక దీనితో పాటు ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కూడా పూజా కు సూపర్ హిట్ ఇస్తుందని అంత బావిస్తున్నారు.ఇక ఈ మధ్యనే ఈ బ్యూటీ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి మాల్దీవ్స్ వెళ్లి వెకేషన్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేసి తిరిగి ఇండియాకు వచ్చింది.ఇక ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది.
ఈ ఫొటోలో పూజా లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ఉంది.
ఈ ఫోటో షేర్ చేస్తూ.నా కల నెరవేరింది అని బుట్టబొమ్మ తెలిపింది.”లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారితో కలిసి వర్క్ చెయ్యాలని.షూటింగ్ లో కలిసి పాల్గొనాలని నాకు ఎప్పట్నుంచో ఉన్న కల.అది ఇన్నాళ్లకు నెరవేరింది.ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేసాను.మరింత తెలుసుకోవడానికి కొద్దీ సమయం వేచి ఉండండి” అంటూ పూజా ఈ ఫోటోను షేర్ చేసింది.ఇక ఈ ఫోటోను చుస్తే ఇది ఏదో యాడ్ కోసం షూట్ చేసినట్టు తెలుస్తుంది.ప్రెసెంట్ ఈ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తుంది.