యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా మెజారిటీ షూట్ ఇప్పటికే కంప్లీట్ అయిన ప్రభాస్ కి సంతృప్తికరంగా లేని కొన్ని సన్నివేశాలని మళ్ళీ రీషూట్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన పారిస్ సెట్ లో కీలక సన్నివేశాలని కొద్ది రోజులుగా చిత్రీకరిస్తున్నారు.అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో చాలా వరకు సినిమా షూటింగ్ లు అన్ని ఇప్పటికే వాయిదా వేసుకున్నారు.
ఈ నేపధ్యంలో పూజాహెగ్డే కూడా కొంత భయపడి షూటింగ్ లో పాల్గొనలేనని చెప్పి హోం ఐసోలేషన్ లో ఉంది.అదే సమయంలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ కూడా చేసుకుంది.
తాజాగా ఈమెకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ద్రువీకరించింది.అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆమెకి కోవిడ్ ఎలా వచ్చిందనే విషయం అర్ధం కాకున్నా ఇప్పుడు పూజా హెగ్డే కారణంగా ప్రభాస్ కూడా హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు.అలాగే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ తో పాటు మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆపేసి క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు.
అలాగే టెస్ట్ లు కూడా చేయించుకోవడానికి రెడీ అవుతున్నారు.పూజా హెగ్డే కారణంగా ప్రభాస్ కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
మొత్తానికి పూజా హెగ్డే క్వారంటైన్ లోకి వెళ్తూ వెళ్తూ రాధేశ్యామ్ టీమ్ మొత్తాన్ని టెన్షన్ లో పెట్టి వెళ్ళిపోయిందని ఇప్పుడు ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు.మరి ఈ టీమ్ లో ఎంత మందికి కరోనా నిర్ధారణ అవుతుందనేది వేచి చూడాలి.