టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే.ఇప్పటికే ఈ అమ్మడు గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాలో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో పాటు, పాన్ ఇండియా సినిమా అయినా రాధేశ్యామ్ లో నటిస్తుంది.ఈ సినిమాల షూటింగ్ నడుస్తుంది.
మరో వైపు బాలీవుడ్ లో ఏకంగా మూడు సినిమాలకి కమిట్ అయ్యింది.అందులో సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి కాగా, మరో సినిమాలో రణవీర్ సింగ్ తో జతకడుతుంది.
ఈ రెండు సినిమాలు షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు వీటితో పాటు తెలుగులో ఒక సినిమాలో నటించడానికి పూజా హెగ్డే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో హర్రర్ జోనర్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే కాథరీత్యా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.అందులో ఒక పాత్ర కోసం ఇప్పటికే అవికాగోర్ ని ఫైనల్ చేశారు.ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్లు కోసం విక్రమ్ కె కుమార్ సెర్చ్ చేస్తూ ఉండగా అందరిలో ఒకరుగా పూజాహెగ్డేని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.గతంలో నాగ చైతన్యుతో కలిసి ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్డే నటించింది.
అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయితే విక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో నిడివి తక్కువగా ఉన్న థాంక్యూ సినిమాలో నటించడానికి పూజా హెగ్డే ఒకే చెప్పిందని తెలుస్తుంది.