మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది.
దేవాలయాల పరిరక్షణ నేపధ్యంలో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ బట్టి తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలలో కనిపించబోతున్నాడు.
సెకండ్ ఆఫ్ రామ్ చరణ్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.అతను కామ్రేడ్ సిద్దా అనే పాత్రలో సినిమాలో కనిపిస్తున్నాడు.
నక్షలిజానికి బ్రహ్మనిజాన్ని లింక్ చేస్తూ ఈ సినిమా కాన్సెప్ట్ ని కొరటాల చెబుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి మొదటి నుంచి లీకుల బెడద ఉంది.
ఈ సినిమా టైటిల్ విషయంలో కొద్ది రోజులు సస్పెన్స్ నడిచింది.
సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్న సమయంలో చిరంజీవి నేరుగా ఓ ప్రీ రిలీజ్ వేడుకలో ఆచార్య సినిమా టైటిల్ రివీల్ చేసేశారు.ఇక తప్పనిసరి పరిస్థితిలో కొద్ది రోజుల్లోనే ఆ టైటిల్ మీద పోస్టర్ రిలీజ్ చేశారు.ఇక తరువాత ఫస్ట్ లుక్ రిలీజ్ కాకుండానే సినిమాలో చిరంజీవి లుక్ బయటకి వచ్చి వైరల్ అయ్యింది.
అలాగే సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న విషయాన్ని టీజర్ ద్వారా చెప్పాలని అనుకుంటే ఈ విషయాన్ని చిరంజీవి లీక్ చేసేశారు.ఇక చేసేదేం లేక ఆ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.
ఇంతలో పూజా హెగ్డే తాజాగా ఈ విషయాన్ని లీక్ చేసింది.ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయాన్ని చెప్పేసింది.
అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీలో కూడా తాను నటిస్తున్న విషయాన్ని ఆ మధ్య పూజా హెగ్డే లీక్ చేసింది.అలాగే టీజర్ రిలేజ్ గురించి కూడా పూజా పాప కొద్ది రోజుల క్రితం లీక్ చేసింది.
దీంతో పూజాహెగ్డే ని లీడ్ తీసుకున్న సినిమా దర్శకులు ముందుగానే ఆమెకి సీక్రెట్స్ రివీల్ చేయొద్దని చెప్పాల్సి వస్తుంది.