త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలా వైకుంఠపురం చిత్రం ద్వారా కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఉత్తరాది సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఒక సినిమా నుంచి తప్పుకోవడంతో పూజా హెగ్డే స్థానాన్ని సామ్ భర్తీ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘బీస్ట్’, ‘సర్కస్’ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న #SSMB28 చిత్రంలో ముందుగా హీరోయిన్ పూజా హెగ్డే ను తీసుకోవాలని వెల్లడించారు.
అయితే పలు కారణాల వల్ల ఈమెకు డేట్స్ సర్దుబాటు కాక ఈమె ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో వెల్లడించారు.
తాజాగా పూజా హెగ్డే సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ వదులుకున్నట్టు నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మేకర్స్ హీరోయిన్ సమంతను సంప్రదించడంతో ఇందుకు ఈమె ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.ఇప్పటికే మహేష్ బాబు సమంత కాంబినేషన్లో మూడు చిత్రాలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో సమంత నటిస్తే వీరిద్దరి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా అవుతుంది.