కరోనా కారణంగా సినిమా బడ్జెట్ను కనీసం 20 నుండి 50 శాతం వరకు తగ్గించుకోవాల్సిందే అంటూ నిర్మాతలు భావిస్తున్నారు.రాబోయే రెండు సంవత్సరాల వరకు సినిమా బిజినెస్ ఆశాజనకంగా ఉండకపోవచ్చు.
ఈ పరిస్థితులు కుదుట పడే వరకు బడ్జెట్ను తగ్గించుకుంటేనే మంచిది.లేదంటే ఇండస్ట్రీలో లేకుండా పోతారు అంటూ కొందరు సీనియర్ నిర్మాతలు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు మరియు దర్శకులు ఇంకా నటీనటులు వారి వారి పారితోషికాలను తగ్గించుకునేందుకు ఓకే చెప్పారు.
తమిళ స్టార్ హీరో తన పారితోషికంను దాదాపుగా 25 కోట్లు తగ్గించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక ఇతర హీరోలు కూడా నిర్మాతలతో ఒప్పందం చేసుకుని తగ్గించుకుంటున్నారు.అయితే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం పారితోషికం విషయంలో తగ్గింపు చూపించకుండా పైపైకి వెళ్తోంది.
అల వైకుంఠపురంలో చిత్రం సూపర్ హిట్తో ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది.అందుకే రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది.
ఇప్పటి వరకు ఈమె కోటిన్నర వరకు తీసుకుంది.
అల వైకుంఠపురంలో చిత్రానికి 1.3 కోట్లు రాధేశ్యామ్ చిత్రానికి 1.5 కోట్లు పారితోషికం తీసుకుంది.ఇప్పుడు ఆ రెండు సినిమాల ఫలితాల నేపథ్యంలో రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది. రాధేశ్యామ్ చిత్రం విడుదలై సక్సెస్ అయితే ఈమె పారితోషికం మూడు కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అంతటి పారితోషికంను డిమాండ్ చేస్తున్న ఈ అమ్మడికి నిర్మాతలు షాక్ ఇస్తున్నారు.ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు ఆఫర్ ఇద్దామనుకున్నా ఇప్పుడు మరో వైపు చూస్తున్నారు.పారితోషికం విషయంలో మరీ ఇంత బెట్టు చేస్తే కెరీర్లో ముందుకు వెళ్లడం కష్టం అమ్మడు.