అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన సంగతి తెలిసిందే.ఆమె చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటుండటంతో ఆమెను తమ సినిమాలో హీరోయిన్గా తీసుకుంటే కలిసొస్తుందని చాలా మంది హీరోలు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ ఏడాదిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించడంతో ఆ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచిందని చాలా మంది అనుకుంటున్నారు.
దీంతో పూజా డిమాండ్ అమాంతం ఆకాశానికి చేరిపోవడంతో ఆమె తన రెమ్యునరేషన్ను కూడా అదే స్థాయిలో పెంచేసింది.ఒక్కో సినిమాకు ఏకంగా రూ.2.5 కోట్లు వరకు తీసుకుంటోంది ఈ బ్యూటీ.కాగా ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాలను లైన్లో పెట్టిన ఈ బ్యూటీ, తాజాగా మరో సినిమాను ఓకే చేసింది.
మలయాళ హీరో దుల్కర్ సాల్మన్ను తెలుగు తెరకు స్ట్రెయిట్గా పరిచయం చేస్తూ దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు.ఈ సినిమాను నిర్మాత అశ్వినీ దత్ కుమార్తెలు స్వప్నా, ప్రియాంకా దత్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాగా హీరోయిన్గా పూజా హెగ్డేను తీసుకున్న వారు ఆమె రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరారట.
దీంతో వెంటనే రెమ్యునరేషన్ తగ్గించేందుకు పూజా అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇలా తెలుగు హీరోల చిత్రాలకు ఏమాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోని పూజా హెగ్డే, మలయాళ స్టార్ హీరో కోసం రెమ్యునరేషన్ తగ్గించడం ఏమిటా అని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు.ఏదేమైనా పూజా రెమ్యునరేషన్ పెంచినా, తగ్గించినా టాక్ ఆఫ్ ది టౌన్గా మారుతుందంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
ఇక దుల్కర్ సాల్మన్తో చేయబోయే సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు పూజా ఎంతో ఆసక్తిగా ఉందట.