టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ స్టార్ హీరో అయినా కూడా ఈ ముగ్గురిలో ఒకరితో సినిమాను చేయాలని కోరుకుంటున్నారు.యంగ్ హీరోలు కూడా ఈ ముగ్గురిలో ఒకరిని తమ సినిమాల్లో నటింపజేయాలంటూ నిర్మాతలకు మరియు దర్శకులకు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఆ ముగ్గురే పూజా హెగ్డే, కీర్తి సురేష్ మరియు రష్మిక మందన్నా.ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ నెం.1 హీరోయిన్ స్థానం కోసం పోటా పోటీగా పోరాటం చేస్తున్నారు అనిపిస్తుంది.వీరు పారితోషికం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.
ఈ ముగ్గురు కూడా తమ పారితోషికాలను రెండు కోట్లకు మించి డిమాండ్ చేస్తున్నారు.పూజా హెగ్డే ‘రాధేశ్యామ్’, రష్మిక ‘పుష్ప’ మరియు కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలు చేస్తున్నారు.
ఈ మూడు సినిమాలు కూడా టాలీవుడ్ లో మోస్ట్ వెయిటింగ్ మూవీలుగా చెప్పుకోవచ్చు.
ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే వీరి పారితోషికం మరింతగా పెరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా రెండు కోట్ల వద్ద ఉన్నారు.ఒక వేళ వారు చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ అయితే అంటే వచ్చే ఏడాదిలో వీరి పారితోషికాలు రెండున్నర కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
వీరి సందడి మామూలుగా లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఎక్కువ తక్కువ సినిమాలు కమిట్ అవ్వకుండా వీరు చాలా జాగ్రత్తగా సినిమాలను చేస్తున్నారు.సక్సెస్ అయితే పారితోషికం పెంచడం కోసం వెయిట్ చేస్తున్నారు.మరి వీరు వచ్చే ఏడాది మరింతగా పారితోషికాలు పెంచుతారా వీరిలో వచ్చే ఏడాది పై చేయి ఎవరిది అయ్యి ఉంటుంది.ఎవరు నెం.1 గా నిలుస్తారు అనేది ప్రస్తుతం అందరి ముందు ఉన్న ప్రశ్న.మరి ఈ ముగ్గురిలో మీ అభిమాన హీరోయిన్ ఎవరో మాకు తెలియజేయండి.