ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్స్ ఎవరంటే ఇద్దరు పేర్లు వినపడతాయి.ఆ ఇద్దరే బుట్ట బొమ్మ పూజా హెగ్దే, కన్నడ భామ రష్మిక మందన్న.
స్టార్ సినిమా అంటే చాలు ఈ ఇద్దరి డేట్స్ అడిగిన తర్వాతే మరో హీరోయిన్ దగ్గరకు ఛాన్స్ వెళ్తుంది.పూజా హెగ్దే సినిమాలో ఉంటే తొడల అందాలతో కిక్ ఎక్కిచేస్తుంది.
పూజా సినిమాలో ఉంటే గ్లామర్ షో విషయంలో ఆలోచించాల్సిన పని ఉండదు.ఇక రష్మిక కూడా తన మార్క్ మ్యాజిక్ తో ఆడియెన్స్ ను అలరిస్తుంది.
ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా పోటీ పడుతున్నారు.రష్మిక మందన్న సినిమాకు రెండు కోట్ల దాకా తీసుకుంటుంటే పూజా హెగ్దే తమిళ ఆఫర్ తో నాలుగు కోట్లు ఫిక్స్ చేసుకుంది.
రష్మిక కూడా ఈమధ్యనే సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.తెలుగులో సత్తా చాటుతున్న ఈ భామలు ఇక ఇప్పుడు తమిళ పరిశ్రమలో తమ క్రేజ్ పెంచుకోవాలని చూస్తున్నారు.
పాపులారిటీ విషయంలో పూజా హెగ్దే, రష్మీక్ ఇద్దరికి ఇద్దరు తీసిపోని విధంగా ఉన్నారు.చూస్తుంటే ఈ ఇద్దరు మరో ఐదేళ్ల వరకు ఇదే ఫాం కొనసాగించేలా ఉన్నారు.